కామారెడ్డి కలెక్టరేట్​లోని ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

కామారెడ్డి కలెక్టరేట్​లోని ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్​లోని ప్రజావాణికి 86 ఫిర్యాదులు వచ్చాయి. కామారెడ్డిలో కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​, అడిషనల్ కలెక్టర్లు  వి.విక్టర్, చందర్​నాయక్ ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  భూ సమస్యలు, ఇండ్ల మంజూరు,  రైతు భరోసా తదితర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. పెండింగ్​లో ఉన్న 409 ఫిర్యాదులను పరిశీలించి బాధితులకు సమాచారమివ్వాలని కలెక్టర్ ఆదేశించారు.    

నిజామాబాద్​లో 106 ఫిర్యాదులు

నిజామాబాద్,వెలుగు : కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 106 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో ఆఫీసర్లు  వినతులు స్వీకరించారు. ఏ అర్జీని పెండింగ్​ పెట్టొద్దని కలెక్టర్​ సూచించారు. అదనపు కలెక్టర్లు అంకిత్​, కిరణ్​కుమార్​, జడ్పీ సీఈవో సాయాగౌడ్​, నగర పాలక కమిషనర్​ దిలీప్​కుమార్​, డీపీవో శ్రీనివాస్​ తదితరులు ఉన్నారు.