
కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్లోని ప్రజావాణికి 86 ఫిర్యాదులు వచ్చాయి. కామారెడ్డిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, చందర్నాయక్ ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భూ సమస్యలు, ఇండ్ల మంజూరు, రైతు భరోసా తదితర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. పెండింగ్లో ఉన్న 409 ఫిర్యాదులను పరిశీలించి బాధితులకు సమాచారమివ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
నిజామాబాద్లో 106 ఫిర్యాదులు
నిజామాబాద్,వెలుగు : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 106 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో ఆఫీసర్లు వినతులు స్వీకరించారు. ఏ అర్జీని పెండింగ్ పెట్టొద్దని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, నగర పాలక కమిషనర్ దిలీప్కుమార్, డీపీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.