ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుండి ప్రణయ్, శ్రీకాంత్ ఔట్

ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుండి ప్రణయ్, శ్రీకాంత్ ఔట్
  •     రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సింధు

బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  ఇండియా స్టార్ షట్లర్లు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఓడి ఇంటిదారి పట్టారు. మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడో సీడ్ ప్రణయ్ 21–14, 13–21, 13–21తో లి యాంగ్ సు (చైనీస్ తైపీ) చేతిలో మూడు గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటు పోరాడి ఓడిపోయాడు. మరో మ్యాచ్‌‌లో శ్రీకాంత్ 9–21, 9–21 టాప్‌‌ సీడ్ అక్సెల్సెన్‌‌ (డెన్మార్క్‌‌) చేతిలో చిత్తయ్యాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింధు 21–11తో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన తర్వాత ప్రత్యర్థి వైవొనె లి (జర్మనీ) రిటైర్డ్ హర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. దాంతో సింధు రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టింది. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆకర్షి కశ్యప్ 16–21, 11–21తో  పై యు పో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది.