ప్రాంక్.. పాణం తీసింది..మూడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి

ప్రాంక్.. పాణం తీసింది..మూడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి

ముంబై : ప్రాంక్ వీడియో ఓ మహిళ ప్రాణం తీసింది. షాపింగ్ మాల్​లో పనిచేసే మహిళను ఆటపట్టించేందుకు తోటి సిబ్బంది చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. వీడియో చేస్తుండగా ఆమె మూడో ఫ్లోర్​ నుంచి కిందపడటంతో స్పాట్​లోనే ప్రాణాలు కోల్పోయింది. ముంబై దగ్గర డోంబివాలీ ప్రాంతంలోని గ్లోబ్ స్టేట్ బిల్డింగ్​లో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మృతురాలిని నాగినా దేవి మంజీరామ్​గా గుర్తించారు.

ఈమె బిల్డింగ్​ కాంప్లెక్స్​లో వాచ్​మన్​గా పనిచేస్తున్నారు. వీడియో తీసుకునేందుకు ఆమె మూడో ఫ్లోర్​లోని బాల్కనీ గోడ మీద కూర్చుండగా, తోటి ఉద్యోగి సరదాగా నెట్టివేస్తున్నట్లు ప్రాంక్ చేద్దామని చూశాడు. ఈ సమయంలో నాగినాదేవి పట్టుతప్పి కిందపడిపోయింది. ఆమెను పట్టుకునేందుకు అతడు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.