
మాజీ ఐపీఎస్, బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ప్రవీణ్ ఐపీఎస్’. సీరియల్ ఆర్టిస్ట్ నంద కిషోర్, రోజా జంటగా దుర్గా దేవ్ నాయుడు దర్శకత్వంలో నీలా మామిడాల నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్తోపాటు నిర్మాత దామోదర్ ప్రసాద్, దర్శకుడు రమణ తేజ, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీ బాయి హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. నవంబర్లో సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు.