వంద రోజుల్లో రూ.270 కోట్లతో పనులు : ప్రేమ్​సాగర్​ రావు 

వంద రోజుల్లో రూ.270 కోట్లతో పనులు : ప్రేమ్​సాగర్​ రావు 

మంచిర్యాల, వెలుగు: కాంగ్రెస్​100 రోజుల పాలనలో మంచిర్యాల నియోజకవర్గంలో రూ.270 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు తెలిపారు. బుధవారం తన నివాసంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. నియోజకవర్గంలోని 280 స్కూళ్లలో రూ.17.90 కోట్లతో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నట్టు చెప్పారు. లక్సెట్టిపేట స్కూల్​ బిల్డింగ్​కోసం రూ.5.80 కోట్లు కేటాయించామన్నారు. మంచిర్యాల, హాజీపూర్, దండేపల్లిలో రెసిడెన్షియల్​ స్కూళ్లు తీసుకొస్తామన్నారు. మంచిర్యాల, నస్పూర్​, లక్సెట్టిపేట మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో రూ.270 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, బ్రిడ్జిలు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నామని వరించారు.

రాళ్లవాగు ముంపు నుంచి రక్షణ కోసం రూ.270 కోట్లతో కరకట్టలకు ప్రపోజల్స్​ పంపామన్నారు. రాళ్లవాగుపై రూ.20 కోట్లతో హైలెవల్ ​బ్రిడ్జి పనులకు భూమిపూజ చేశామన్నారు. రూ.250 కోట్లతో లక్ష్మీటాకీస్​ నుంచి శ్రీశ్రీనగర్​ వరకు 100 ఫీట్ల రోడ్డు, ఆర్వోబీ, రూ.172 కోట్లతో దండేపల్లి మండలం తపాల్​పూర్​ నుంచి లక్సెట్టిపేటలోని కరీంనగర్​ చౌరస్తా వరకు రోడ్డు, రూ.18 కోట్లతో కోర్టు బిల్డింగ్​ పనులకు ప్రపోజల్స్ రెడీ చేశామని తెలిపారు. మంచిర్యాల ఐబీలోని 4 నాలుగు ఎకరాల్లో 600 బెడ్స్​తో హాస్పిటల్​నిర్మిస్తామని చెప్పారు. వీటితోపాటు చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.