లోక్ సభ ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఏడు రాష్ట్రాల్లో 59 నియోజకవర్గాలకు పోలింగ్ జరగుతుంది. పలువురు రాజకీయ నాయకులు,సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నల్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ఢిల్లీ మాజీ సీఎం, నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్తి షీలా దీక్షిత్ నిజముద్దీన్ లోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.