రిపబ్లిక్ డే : అమర జవాన్లకు నివాళులర్పించిన మోడీ

రిపబ్లిక్ డే : అమర జవాన్లకు నివాళులర్పించిన మోడీ

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమర జవాన్లకు నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇండియా గేట్ అమర్ జవాన్ జ్యోతి స్మారకం దగ్గర పుష్ఫగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రధాని తో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. త్రివిధ దళాల అధిపతులు నివాళులర్పించారు.