సత్యం, అహింస వంటి మార్గాలతో ప్రపంచాన్ని మార్చిన మహనేత గాంధీ అని కొనియాడారు యూకే పీఎం బోరిస్ జాన్సన్. గురువారం ఆయన గాంధీ సబర్మతి ఆశ్రమానికి సందర్శించారు. ఈ సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో ఆయన చరఖా తిప్పారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో మహత్మా గాంధీ శిష్యురాలిగా మారిన బ్రిటీష్ అడ్మిరల్ కూతురు మడేలిన్ స్లేడ్(మీరాబెన్) ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానికి సబర్మతి ఆశ్రమం వారు బహుమతిగా అందజేశారు.
#WATCH | Prime Minister of the United Kingdom Boris Johnson visits Sabarmati Ashram, tries his hands on 'charkha' pic.twitter.com/6RTCpyce3k
— ANI (@ANI) April 21, 2022