ప్రముఖులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

ప్రముఖులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకల సందర్భంగా ఇవాళ జాతీయ కమిటీతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ కమిటీలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి,  కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సినీరంగ ప్రముఖులు ఉన్నారు.  మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , కిషన్ రెడ్డి  మీటింగ్ కు  హాజరయ్యారు. పలు రంగాల ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ అధికారులు పాల్గొన్నారు.