ఎకానమీకి స్టార్టప్​లు ముఖ్యం

ఎకానమీకి స్టార్టప్​లు ముఖ్యం

హైదరాబాద్​, వెలుగు: ఇన్నోవేషన్లు, ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధికి స్టార్టప్‌‌‌‌లు చాలా ముఖ్యమని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. నగరంలో జరిగిన ‘ఆర్​జేఈవైఎస్​ ఇన్ఫినిటీ సొల్యూషన్స్’ రెండవ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ, “స్టార్టప్‌‌‌‌లు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి. అద్భుతమైన టెక్నాలజీలను తెస్తున్నాయి.  సమస్యల పరిష్కారానికి సమర్థమైన విధానాలను తీసుకువస్తున్నాయి.

స్టార్టప్‌‌‌‌ల   సామర్థ్యాన్ని గుర్తించి  ప్రభుత్వాలు,  ఇండస్ట్రీలు వాటికి మద్దతు ఇవ్వాలి ”అని ఆయన అన్నారు. ఆర్​జేఈవైఎస్​ కంపెనీ సీఈఓ  రత్న రాజు జెట్టి మాట్లాడుతూ తాము రెండేళ్లలో దాదాపు 50 మందికి పైగా ఉపాధిని కల్పించామని చెప్పారు.  విదేశాల్లోనూ వ్యాపారాన్ని విస్తరిస్తామని రాజు వెల్లడించారు.