డెలివరీ చేసి కడుపులో.. టవల్ మర్చిపోయిండు

డెలివరీ చేసి కడుపులో.. టవల్ మర్చిపోయిండు

అమ్రోహా(యూపీ): పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు డెలివరీ చేసిన ప్రైవేట్ డాక్టర్.. కడుపులో టవల్ మరిచిపోయి కుట్లేసిన ఘటన ఉత్తరప్రదేశ్​లోని అమ్రోహా జిల్లా బన్స్​ఖేరీ గ్రామంలో చోటు చేసుకుంది. డెలివరీ తర్వాత కూడా ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండటంతో వేరే హాస్పిటల్​కెళ్లి పరీక్షించుకోగా లోపల టవల్ ఉన్నట్టు గుర్తించారు. బన్స్​ఖేరీకి చెందిన శంషేర్ అలీ, తన భార్య నజ్రానాను డెలివరీ కోసం సైఫీ నర్సింగ్ హోంకు తీసుకొచ్చాడు. డాక్టర్ మత్లూబ్ తన స్టాఫ్​తో కలిసి నజ్రానాకు డెలివరీ చేశాడు. కడుపు నొప్పి ఎక్కువ ఉందని నజ్రానా డాక్టర్​కు చెప్పింది. చలి కారణంగానే ఇలా అవుతుందని చెప్పి.. మరో ఐదు రోజులు అబ్జర్వేషన్​లో ఉంచాడు. తర్వాత ఇంటికి పంపేశాడు. అయినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో.. శంషేర్ అలీ తన భార్యను వేరే ప్రైవేట్ హాస్పిటల్​కు తీసుకెళ్లాడు. అప్పుడు అసలు విషయం బయటికొచ్చింది. కడుపులో చిన్న టవల్​ను గుర్తించిన అక్కడి డాక్టర్లు..  మళ్లీ ఆపరేషన్​ చేసి దాన్ని తీసేశారు.