
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్సులో 32 మంది ప్రయాణికులు ఉండగా.. ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతి బస్సు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్లో కూడా కారు ప్రమాదం కలకలం రేపింది. బేగంపేట్ నుంచి బల్కంపేట్ వైపుగా వెళ్లే ఫ్లైఓవర్ పైన కారులో మంటలు రేగాయి. రన్నింగ్లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సనత్ నగర్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలని అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారులో ఉన్న వ్యక్తులు కారును అక్కడే వదిలేసి వెళ్లినట్టుగా సమాచారం. పాత ఇండికా కారుగా అధికారులు గుర్తించారు. కారు వివరాలు.. దానికి సంబంధించిన ఓనర్ ఎవరనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.