ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. ఎలిమినేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యేదెవరో?

ప్రొ కబడ్డీ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ..  ఎలిమినేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యేదెవరో?

    రా. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌లో

హైదరాబాద్, వెలుగు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి దశకు వచ్చేసింది. మెగా లీగ్ ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్ సిద్ధమైంది.  సోమవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పట్నా పైరేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దబాంగ్ ఢిల్లీ కేసీ తలపడనుంది. రెండో ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హర్యానా స్టీలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గుజరాత్ జెయింట్స్ పోటీ పడుతుంది. ఇందులో గెలిచిన జట్లు సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్తాయి. ఓడిన జట్లు ఇంటిదారి పడుతాయి. ఈ నేపథ్యంలో ఎలిమినేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ ప్రత్యర్థులతో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ నాలుగు జట్ల కెప్టెన్లు తెలిపారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాము పక్కా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సత్తా చాటామని అదే జోరును ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కొసాగిస్తామని ఢిల్లీ కేసీ కెప్టెన్ అషు మాలిక్ అన్నాడు. లీగ్ దశలో రాణించిన తమ డిఫెండర్లు, రైడర్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని పట్నా పైరేట్స్ కెప్టెన్ సచిన్ తెలిపాడు.

మరిన్ని వార్తలు