శాకుంతలం డిజాస్టర్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

శాకుంతలం డిజాస్టర్..  దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

శాకుంతలం డిజాస్టర్ రిజల్ట్ పై నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన శాకుంతలం సినిమాకి ఈ రిజల్ట్ ఊహించలేదన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీ.. విడుదలైన మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. పెరియాడికల్ పీరియాడికల్ డ్రామాగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది.

అయితే... ఈ సినిమా రిజల్ట్ పై తాజాగా స్పందించారు చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.  "తన పాతికేళ్ల కెరీర్ లోనే శాకుంతలం సినిమా అతిపెద్ద లాస్ గా చెప్పుకొచ్చాడు. "సగటు ఆడియన్స్ ను అన్ని థియేటర్లకు పంపించి రివ్యూస్ తెప్పించేశాం. అప్పటికే మాకు విషయం అర్థమైపోయింది. సోమ, మంగళవారానికి కలెక్షన్లు లేవంటే రిజల్ట్ ఏంటనేది అర్థమైపోవాలి. అప్పటికీ భ్రమల్లోనే ఉంటామంటే నడవదు. నా 25 ఏళ్ల కెరీర్ లోనే అతిపెద్ద జర్క్ ఇచ్చిన సినిమా శాకుంతలం." అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.

డైరెక్టర్ గుణశేఖర్ తో కలిసి ఈ సినిమాను నిర్మించిన రాజు.. సమంతపై, కథపై ఉన్న నమ్మకంతో భారీగా పెట్టుబడి పెట్టాడు. దీంతో భారీ నష్టాలని చవిచూడాల్సి వచ్చింది దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ నట్టింట వైరల్ గా మారాయి.