‘కుటుంబమంతా కలిసి చూసేలా ‘మ్యాడ్’ చిత్రం ఉంటుందని, ‘జాతిరత్నాలు’ చిత్రం కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెప్తే.. టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం’ అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఆయన సమర్పకుడిగా సూర్యదేవర హారిక, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకుడు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ప్రధానపాత్రలు పోషించారు.
మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కీలకపాత్ర పోషించిన ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ ‘దర్శకుడు నాకు పదేళ్లుగా ఫ్రెండ్. తనలోని ఎనర్జీ, హ్యూమర్ ఈ సినిమాలోనూ ఉన్నాయి. ‘జాతిరత్నాలు’తో పోల్చితే నాకు ‘మ్యాడ్’ సినిమానే ఎక్కువ నచ్చింది’ అన్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇందులో మ్యాడ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది. ప్రేక్షకులు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు’ అన్నాడు. అక్టోబర్ 6న సినిమా విడుదల కానుంది.