జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన మతి స్థిమితం లేని వ్యక్తి

జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన మతి స్థిమితం లేని వ్యక్తి

జీడిమెట్ల, వెలుగు : మతి స్థిమితంలేని ఓ వ్యక్తి  ప్రొఫెసర్ జయశంకర్​ విగ్రహం  ధ్వంసం చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండ మహావీర్​కాలనీకి చెందిన గోవింద్​కు 2014 నుంచి మతిస్థిమితం సరిగా ఉండడం లేదు.  దీంతో అతడు మెడిసిన్ వాడుతున్నాడు. కొంతకాలంగా మెడిసిన్ వాడటం మానివేయడంతో  మళ్లీ మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్నాడు. మంగళవారం ఎల్లమ్మబండలోని ప్రొఫెసర్ జయశంకర్​ విగ్రహాన్ని ధ్వంసం చేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మతి స్థిమితం సరిగా లేదని తేలింది. దీంతో గోవింద్ ను ఎర్రగడ్డ లోని మెంటల్​ఆస్పత్రికి తరలించారు.  ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలని మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు.