ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ కు మద్దతు ఇవ్వండి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ కు మద్దతు ఇవ్వండి

వరంగల్ అర్బన్: కరోనా ఎఫెక్ట్ వ‌ల్ల రాష్ట్ర ఖ‌జానాలో డబ్బులు లేని సమయంలో ఎల్ఆర్ఎస్ కట్టాలని ప్రభుత్వం ప్ర‌జ‌ల‌ను వేధిస్తోందని అన్నారు ప్రొఫెసర్ కోదండ రామ్. ఆస్తుల రెమ్యునేషన్ ప్రక్రియ గందరగోళంగా మారిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శ‌నివారం ఎమ్మెల్సీ ఎన్నిక కోసం హన్మకొండలో టీజెఎఫ్ వరంగల్ అర్భన్ జిల్లా కార్యాలయం ప్రారంభించారు కోదండ రాం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చాక కూడా.. లక్షన్నర పోస్టులు ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీ లేద‌ని, ఉద్యోగులను కట్టు బానిసలుగా మార్చారన్నారు. తెలంగాణ తెచ్చిన ఆకాంక్షను అణచివేశారన్నారు

అమరుల త్యాగాలను కాపాడుకునేందుకు టీజేఎస్ ముందుకొచ్చిందని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లు.. నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజేఎస్ కు మద్దతు ఇవ్వాల‌ని కోదండ‌రాం పిలుపునిచ్చారు.