డిసెంబర్తో ముగిసిన మూడో క్వార్టర్లో రిలయన్స్ లాభం 13 వేల కోట్లు
రెవెన్యూ కూడా రూ. 1.2 లక్షల కోట్లకు పెరిగింది
పంట పండించిన డిజిటల్
రిటెయిల్ సేల్స్ తగ్గాయ్
ముంబై: దేశంలోనే అతి పెద్ద లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాభం అంతకు ముందు ఏడాది మూడో క్వార్టర్తో పోలిస్తే 12.5 శాతం పెరిగింది. ఎనలిస్టుల అంచనాలకు మించిన రిజల్ట్స్ను రిలయన్స్ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడో క్వార్టర్కు కంపెనీకి రూ. 13,101 కోట్ల లాభం వచ్చింది.
- ఆయిల్ నుంచి టెలికం దాకా విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డిసెంబర్, 2020 క్వార్టర్లో ఆదాయాన్ని కూడా 21.10 శాతం పెంచుకుంది. ఈ క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ రూ. 1.2 లక్షల కోట్లకు చేరింది. రిఫైనింగ్ బిజినెస్ ఇంకా కష్టాలలో కొనసాగుతుండటం వల్లే టర్నోవర్ ఇంకా పెరగలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెవెన్యూ రూ. 1.27 లక్షల కోట్లు, లాభం రూ. 11,420 కోట్లు ఉండొచ్చని అంతకు ముందు ఎనలిస్టులు అంచనా వేశారు.
- రిలయన్స్ టర్నోవర్లో మూడింట రెండు వంతులు రిఫైనింగ్, పెట్రో కెమికల్ బిజినెస్ల నుంచే వస్తోంది. తాజా క్వార్టర్లో ఈ రెవెన్యూ అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లోని రూ. 1.19 లక్షల కోట్ల నుంచి రూ. 83,338 కోట్లకు పడిపోయింది. కరోనాతో ఫ్యూయెల్ డిమాండ్ తగ్గిపోవడంతో ఆ ప్రభావం రిఫైనింగ్ బిజినెస్పై పడిందని కంపెనీ తెలిపింది.
- డిజిటల్ సర్వీసెస్ రెవెన్యూ మాత్రం అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్లోని రూ. 17,849 కోట్ల నుంచి డిసెంబర్ 2020 క్వార్టర్లో రూ. 23,678 కోట్లకు పెరిగింది. లాభాల్లోనూ డిజిటల్ సర్వీసెసే ముందుంది. కంపెనీ గ్రోత్ను ఇదే నడిపిస్తోంది.
- రిలయన్స్ రిటెయిల్ సేల్స్ కూడా డిసెంబర్ 2020 క్వార్టర్లో తగ్గాయి. అంతకు ముందు ఏడాది మూడో క్వార్టర్లోని సేల్స్ రూ. 45,348 కోట్ల నుంచి తాజా క్వార్టర్లో రూ. 36,887 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే రిటైల్ ఈబీఐటీడీఏ 53.9 శాతం పెరిగి రూ.3,087 కోట్లుగా ఉంది.
షేరు పడింది…
శుక్రవారం సాయంత్రం ఫైనాన్షియల్ రిజల్ట్స్ ప్రకటించనున్న నేపథ్యంలో ఎన్ఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2.4 శాతం పతనమై రూ. 2,049.60 వద్ద ముగిశాయి.
ఇండియా ఎకానమీ రికవరీ బాటలో నడుస్తోంది. ఇందులో మేం కూడా భాగం పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. డిసెంబర్ 2020 క్వార్టర్లో కంపెనీ పనితీరు సంతృప్తి కలిగిస్తోంది. ఆయిల్ టూ కెమికల్ బిజినెస్ కూడా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలోనే మంచి ఆపరేషనల్ రిజల్ట్స్ ప్రకటించగలిగాం. డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ క్రమంగా గ్రోత్ సాధిస్తోంది. మార్చి 2020 నుంచి కొత్తగా 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించగలగడం గర్వంగా భావిస్తున్నాం. -ముకేశ్ అంబానీ, ఛైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్
జియో లాభం రూ.3,489 కోట్లు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ రిలయన్స్ జియో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,489 కోట్లుగా రిపోర్ట్ చేసింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఈ లాభం 15.5 శాతం పెరిగింది. సెప్టెంబర్ క్వార్టర్లో జియోకి రూ.2,844 కోట్ల నికర లాభం వచ్చింది. ఈ డిసెంబర్ క్వార్టర్లో కంపెనీకి ఒక్కో యూజర్పై వచ్చే యావరేజ్ రెవెన్యూ(ఆర్పూ) నెలకు రూ.151కు పెరిగింది. 2020 డిసెంబర్ 31 నాటికి రిలయన్స్ జియో మొత్తం కస్టమర్లు 41 కోట్లుగా ఉన్నారు. కరోనా సంబంధిత ఇబ్బందులున్నప్పటికీ ఈ క్వార్టర్లో కంపెనీకి 2.51 కోట్ల మంది కస్టమర్లు వచ్చారు.
ఇవి కూడా చదవండి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కి కోటి ఫైన్
V6 రేటింగ్పై కుట్ర.. రేటింగ్ పెరగకుండా ప్రయత్నాలు