పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు

పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు

హైదరాబాద్​, వెలుగు: ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు సీనియారిటీని బట్టి గ్రేడ్​4, 3, 2, 1 పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్​ డిప్యూటీ కమిషనర్​ సుధాకర్​ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం గ్రేడ్​ 1 పంచాయతీ కార్యదర్శులకు డివిజనల్​ పంచాయతీ ఆఫీసర్​ (డీఎల్​పీవో)గా పదోన్నతి దక్కనుంది. ఇప్పటిదాకా ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్​ పీఆర్డీగా ఉన్న పోస్టులను డీఎల్​పీవోలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. అందుకు తగ్గట్టు ప్రమోషన్లు రాబోతున్నాయి. కాగా, శాఖలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు చెప్పాలని సీఎం కేసీఆర్​ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఆ సంఖ్యను తేల్చారు.