శంకర్పల్లి, వెలుగు : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ, మీర్జాగూడ గ్రామాలను కొత్తగా ఏర్పాటయ్యే ఏ మున్సిపాలిటీలో, గ్రేటర్ లో కలపొద్దంటూ ఆదివారం ఇరు గ్రామాల ప్రజలు నిరసన ర్యాలీ తీశారు. బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి, జన్వాడ గ్రామ వార్డు మెంబర్ వెంకటేశ్ మాట్లాడుతూ.. తమ గ్రామాలను మున్సిపాలిటీ, గ్రేటర్లో కలపొద్దని, పంచాయతీలుగానే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యని కలిసి వినతి పత్రం అందజేశారు.
గ్రామ ఎంపీటీసీ నాగేందర్, సొసైటీ చైర్మన్ అరవింద్ రెడ్డి, వైస్ చైర్మన్ కాట్ని నరసింహ, ఉప సర్పంచ్ శ్రీలత రాములు, మీర్జాగూడ ఉప సర్పంచి శాంతి, కో ఆప్షన్ సభ్యులు కె. గోపాల్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.