మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేయాలె : ఎన్పీ వెంకటేశ్

మంత్రి శ్రీనివాస్ గౌడ్  రాజీనామా చేయాలె : ఎన్పీ వెంకటేశ్

మహబూబ్ నగర్ టౌన్ ,వెలుగు: కోర్టు ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్  నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి వెంటనే రాజీ నామా చేయాలని బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు ఎన్పీ వెంకటేశ్​ డిమాండ్ చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేయాలని కోరుతూ ప్లకార్డులతో  గురువారం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ  మంత్రితో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించిందన్నారు.  

ఎన్నికల అఫిడవిట్ విషయంలో  మంత్రిని బర్తరప్​ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మాచారి, శ్రీనివాస్ గౌడ్ , కృష్ణావర్ధన రెడ్డి,   జయశ్రీ, కృష్ణవేణి,  పాండురంగారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.