గ్రామ పంచాయతీల క్యాడర్ స్ట్రెంత్ వెంటనే నిర్ధారించాలి

 గ్రామ పంచాయతీల క్యాడర్ స్ట్రెంత్ వెంటనే నిర్ధారించాలి
  • పీఆర్, ఆర్డీ డైరెక్టర్​కు పీఎస్​సీఎఫ్​ వినతి

హైదరాబాద్, వెలుగు: జీవో నంబర్​317 తో స్థానికత కోల్పోయిన అందరిని 190 జీవో ద్వారా వేకెన్సీతో సంబంధం లేకుండా జోన్లతోపాటు అంతర్గత జోన్లలో కూడా సొంత జిల్లాలకు ట్రాన్స్​ఫర్ చేయాలని పంచాయతీ సెక్రటరీస్ సెంట్రల్​ ఫోరమ్ (పీఎస్ సీఎఫ్) స్టేట్ ​ప్రెసిడెంట్ బలరాం పేర్కొన్నారు. 

గ్రామ పంచాయతీల గ్రేడింగ్, క్యాడర్ స్ట్రెంత్​ వెంటనే నిర్ధారించాలని తెలిపారు. ఈ మేరకు సోమవారం సెక్రటరీస్ సెంట్రల్ ఫోరమ్ నేతలు ఖైరతాబాద్ ఆనంద్ నగర్​కాలనీలోని పంచాయతీరాజ్ కమిషనరేట్​లో పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజనను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యదర్శుల సమస్యలపై డైరెక్టర్​సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు చెప్పారు.