గృహలక్ష్మి కింద రూ.15 లక్షలివ్వాలి

గృహలక్ష్మి కింద రూ.15 లక్షలివ్వాలి

మెదక్​ టౌన్​, వెలుగు:  మెదక్​ జిల్లాలోని పేదలకు ఇండ్లు, ఇండ్ల  స్థలాలు, గృహలక్ష్మి పథకం కింద రూ.15 లక్షలు ఇవ్వాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు.  సోమవారం ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్​ ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు కలెక్టరేట్​లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.  అనంతరం కొద్దిమందికి అవకాశం ఇవ్వగా.. వాళ్లు కలెక్టర్​ రాజర్షి షాను కలిసి వినతి పత్పం అందించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా వైస్​ ప్రెసిడెంట్​ ఎ. మల్లేశం మాట్లాడుతూ... 2006లో రామయంపేట మండలం పర్వతాపూర్,  కాట్రియాల , మెదక్ పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లు ఇచ్చినా,  ఇప్పటి వరకు పొజిషన్ చూపలేదని వాపోయారు.  

Also Read : ఫస్ట్ ఛాయిస్ శ్రీవిష్ణునే..

అలాగే గృహలక్ష్మి పథకం కింద  ప్రభుత్వం ఇచ్చే రూ.3 లక్షలు ఇల్లు బేస్‌‌మెట్‌‌కు కూడాసరిపోవని మండిపడ్డారు.   గ్రామాల్లో గుడిసెల్లో ఉంటున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, మెదక్​ తహసీల్దార్‌‌‌‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా  పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజ్​, కోశాధికారి నర్సమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, ఆవాజ్ జిల్లా కన్వీనర్ మోహినొద్దీన్​,  లచ్చాగౌడ్​ తదితరులు పాల్గొన్నారు.