
యూరోపియన్ కంట్రీలో లక్సెంబర్గ్ అనే దేశం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది. ట్రాఫిక్ జామ్ ను అరికట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
2018 లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం లక్సెంబర్గ్లో ఎక్కువ శాతం మంది ప్రజలు తమ సొంత కార్లలో ప్రయాణిస్తున్నారు. 32% మంది బస్సుల్లో, మొత్తం జనాభాలో 19% మంది మాత్రమే రైలులో ప్రయాణిస్తున్నారని సర్వేలో తేలింది. ప్రైవేట్ కార్ల వినియోగం ఎక్కువగా ఉండడం, ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో.. ఆ ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేసేందుకు రోజుల తరబడి సమయం పడుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు ఆ దేశం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది.
ఇక బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడంతో సగటు ప్రయాణికుడు నెలకు రూ. 7900ఆదా చేసుకుంటున్నట్లు తేలింది. ఎకానమీ క్లాస్లో ప్రయాణించే ప్రయాణికులకు అన్ని సేవలు పూర్తిగా ఉచితం అయినప్పటికీ, ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ లేదా రైలు టిక్కెట్లు పొందగలిగేలా సాధారణ ఛార్జీలను చెల్లించాలనే నిబంధనల్ని విధించింది లక్సెంబర్గ్ ప్రభుత్వం.