
ఇవి తింటే కొవిడ్ రాదు.. అలా చేస్తే కొవిడ్ ముప్పే ఉండదు. ఇలా రోజుకో ఫార్వర్డ్ మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటుంది. అలా ఈ మధ్య ‘‘మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటే కరోనా రమ్మన్నా రాదు’’ అనే మెసేజ్ హల్చల్ చేస్తోంది. ఇందులో నిజమెంత? అని ఫేమస్ పల్మొనాలజిస్ట్ డాక్టర్ వికాస్ మౌర్యని అడిగితే.. ‘‘చాలామంది కొవిడ్ భయానికి డాక్టర్ సలహా తీసుకోకుండా మల్టీవిటమిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు. కానీ, నిజానికి మల్టీవిటమిన్ టాబ్లెట్స్కి, కొవిడ్కి సంబంధమే లేదు. రెగ్యులర్గా మల్టీవిటమిన్స్ వేసుకున్నా కొవిడ్ వస్తుంది. అయితే మల్టీవిటమిన్స్ ఇమ్యూనిటీ బూస్టర్స్గా పనిచేస్తాయి. ఫిజికల్గా ఫిట్గా ఉంచుతాయి. అంతే తప్పించి కొవిడ్కి మల్టీవిటమిన్స్కి సంబంధమే లేదు. డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండా వీటిని వేసుకోవద్దు” అని చెప్పారాయన.