ముంబై : ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో టేబుల్ టాపర్ పుణెరి పల్టన్ జోరు కొనసాగుతోంది.ఆదివారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో పల్టన్ 29–26 తమిళ్ తలైవాస్ను ఓడించి తొమ్మిదో విజయం సొంతం చేసుకుంది.
పుణెరి తరఫున చియనే 8 పాయింట్లతో సత్తా చాటగా.. ఖత్రి (6 పాయింట్లు), అస్లాం ముస్తఫా (5 పాయింట్లు) రాణించారు. తలైవాస్ జట్టులో కెప్టెన్ సాగర్ 7 పాయింట్లు, రైడర్ నరేందర్ 4 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. 10 మ్యాచ్ల్లో 8వ ఓటమితో తలైవాస్ పట్టికలో 11వ స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 41–35తో బెంగాల్ వారియర్స్పై గెలిచింది.