హత్రాస్ దోషులను కఠినంగా శిక్షించండి

హత్రాస్ దోషులను కఠినంగా శిక్షించండి
  •  యూపీ సీఎం యోగికి  రాహుల్ లేఖ 

న్యూఢిల్లీ: హత్రాస్ ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారాన్ని పెంచాలని కోరారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు రాహుల్ లేఖ రాశారు. ‘‘హత్రాస్ ఘటన నన్ను షాక్​కు గురిచేసింది. బాధిత కుటుంబాలను కలిసినప్పుడు వాళ్లను ఓదార్చలేకపోయాను. ఈ ఘటనపై నాలాగే మీరూ బాధపడుతున్నారని తెలుసు. 

చనిపోయినోళ్లను మనం తిరిగి తీసుకురాలేం. కానీ బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన​అవసరం ఉన్నది. మృతుల కుటుంబాలకు మీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదు. పరిహారాన్ని మరింత పెంచి, వీలైనంత తొందరగా అందజేయండి” అని లెటర్​లో విజ్ఞప్తి చేశారు. గాయపడినోళ్లకు మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలని, వాళ్లకు కూడా పరిహారం పెంచాలని రాహుల్​ కోరారు.