- డ్రంకెన్ డ్రైవింగ్లో దొరికితే రక్తదానం చేయాలి
- పంజాబ్లో కొత్త రూల్
చండీగఢ్: తాగి వాహనం నడుపు తూ లేదా సెల్ఫోన్ డ్రైవింగ్చేస్తూ దొరికితే ట్రాఫిక్ పోలీసులు సాధారణంగా జరిమానా విధిస్తారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ను తాత్కాలి కంగా రద్దు చేస్తారు. సిగ్నల్ జంప్ చేసినోళ్లతో కొన్నిసార్లు ట్రాఫిక్ డ్యూటీ చేయిస్తారు. ఇప్పటిదాకా ఇలాంటి ఘటనలను చూశాం. అయితే పంజాబ్లో కొత్త రూల్ తెచ్చారు. స్పీడ్ లిమిట్ దాటడం, తాగి వాహనం నడిపితే ఇకపై రక్తదానం చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఫైన్లు చెల్లించాలి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా తాత్కాలికంగా రద్దవుతుంది.