
రణ్బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటించిన బాలీవుడ్ మూవీ ‘రామాయణం’(Ramayana).డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణం పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ చేసుకుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే, ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. రామాయణం పార్ట్ 1 నుండి బిగ్ అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రామాయణం లోగో లాంచ్ వేడుకను బెంగళూర్లో ఘనంగా జరుపనున్నట్లు సమాచారం.
►ALSO READ | Thammudu Trailer: తమ్ముడు రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. నితిన్కు సక్సెస్ దక్కే ఛాన్స్ ఎక్కువే!
ఈ క్రమంలోనే టైటిల్ టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా గురువారం (జులై 3న) భారీ ఈవెంట్ను ఏర్పాటుచేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలే కనుక నిజమైతే.. రామాయణ ప్రాజెక్ట్ విజువల్ గ్రాండియారిటీపై మరింత స్పష్ఠత వచ్చే అవకాశం ఉంది.
NITESH TIWARI SPEECH - RAMAYANA WRAP
— BOB 2.0 (@shhh_wersoh) June 30, 2025
RAMAYANA GLIMPSE SOON pic.twitter.com/5XFtfwSRlQ
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న VFXస్టూడియో DNEG విజువల్స్ కోసం పనిచేస్తుంది. టీజర్ పోర్షన్ కటింగ్ ఇప్పటికే రెడీ అయినట్లు సినీ వర్గాల టాక్. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్, పౌరాణిక సినీ విశ్వంలో ఒక అద్భుత విజువల్ వండర్ గా ఉండబోతుందని సమాచారం.
Ramayan 1 wrap party video - Ranbir and Ravi Dubey sharing hug
— Redditbollywood (@redditbollywood) June 30, 2025
RAMAYANA GLIMPSE SOON pic.twitter.com/aquAiqqjOr
ఈ పౌరాణిక గాథలో, రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, లారా దత్త కైకేయిగా నటించారు. ఈ మూవీ 2026 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళికి విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.