
ప్రపంచ ప్రసిద్ధి పొందిన పూరీ జగన్నాథుని రథయాత్ర ఈరోజు ( జూన్ 27) జరుగుతుంది . ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ విదియ నాడు నిర్వహించే ఈ పవిత్ర యాత్రను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు. నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలను అందంగా ముస్తాబు చేశారు.
భక్తులు ఈ రథాల వెంటరాగా జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలి వెళ్తుంటారు. ఈ ఏడాది రథయాత్రను ప్రత్యక్షంగా తిలకించేందుకు సుమారు 12 లక్షల మంది భక్తులు పూరీలో హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పూరీ నగరం ఇప్పటికే భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు పర్యవేక్షించేందుకు 275 ఏఐ(AI) కెమెరాలు, డ్రోన్లతో నిఘాను ఏర్పాటు చేశారు. ఇంకా 10 వేల మంది పోలీసులతో సెక్యూరిటి ఏర్పాటు చేశారు.
జగన్నాధుగి రథయాత్రలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆరోగ్య శిబిరాలు.. అంబులెన్స్లు.. మెడికల్ బెడ్స్.. పారామెడికల్ సిబ్బందితో దాదాపు 400 మంది డాక్టర్లు.. AIIMS భువనేశ్వర్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రత్యేక విధులను నిర్వహిస్తున్నారు.
►ALSO READ | BIG BREAKING: గుజరాత్ రథయాత్రలో తొక్కిసలాట : అదుపు తప్పిన ఏనుగుతో గందరగోళం
వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు, నీటి పంపిణీ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. తలపాగా, శీతల పానీయాల వితరణ కూడా జరుగుతోంది. పూరీకి వెళ్లలేని భక్తుల కోసం రథయాత్రను లైవ్ స్ట్రీమ్ ద్వారా ప్రసారం చేస్తున్నారు.
సముద్రతీర భద్రత విషయంలోనూ చురుకుగా వ్యవహరిస్తోంది ఒడిశా ప్రభుత్వం. మెరైన్ పోలీసులు, ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్క్లేవ్ విమానాల ద్వారా నిఘా కొనగిస్తున్నారు. అనుమానాస్పద చలనం ఏదైనా కనిపించినా వెంటనే స్పందించేందుకు డ్రోన్లు, యాంటీ డ్రోన్ టెక్నాలజీ, డాగ్ స్క్వాడ్లు సిద్ధంగా ఉన్నాయి.