క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరిన పుష్ప 2

క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరిన పుష్ప 2

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న  క్రేజీ ప్రాజెక్ట్   ‘పుష్ప ది రూల్’. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం  రామోజీ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిటీలో వేసిన స్పెషల్ సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.  ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు.

ఈ సన్నివేశాలు  సినిమాకు  హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తాయని, ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని చెప్పారు.   ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా,  ఫహాద్ ఫాజిల్,  జగదీష్, అనసూయ, సునీల్, ధనుంజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి  నిర్మిస్తున్న ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.