లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇదే టైమ్కి రిలీజైన ‘పుష్ప : ద రైజ్’ ప్యాన్ ఇండియా వైడ్గా సక్సెస్ సాధించింది. అల్లు అర్జున్ మేనరిజం, డైలాగ్స్తో.. ‘పుష్ప’ మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ‘పుష్ప : ద రూల్’ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది డిసెంబర్లో ‘పుష్ప2’ రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సెట్స్కి వెళ్లడం ఆలస్యమయింది. ఫైనల్గా మంగళవారం షూటింగ్ స్టార్ట్ చేశాడు సుకుమార్. రెగ్యులర్ షూటింగ్కి పక్కా షెడ్యూల్ని ఫిక్స్ చేసుకున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన స్పెషల్ సెట్లో షూట్ జరుగుతోంది. బన్నీతో పాటు ఇతర నటీనటులంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. కొన్ని రోజుల తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి షూటింగ్ షిఫ్ట్ అవనుంది. ఆ తర్వాతి షెడ్యూల్ను బ్యాంకాక్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్లో సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 17కి ఫస్ట్ పార్ట్ విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సెకెండ్ పార్ట్ గ్లింప్స్తో ఫ్యాన్స్కు జోష్ ఇవ్వాలనుకుంటున్నారట. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.