ఏడాది పూర్తి చేసుకున్న పుష్ప..సెలబ్రేట్ చేసుకున్న చిత్ర బృందం

ఏడాది పూర్తి చేసుకున్న పుష్ప..సెలబ్రేట్ చేసుకున్న చిత్ర బృందం

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్', దర్శకుడు 'సుకుమార్' కాంబినేషన్ లో రూపొందిన ‘పుష్ప ది రైజ్’ విడుదలై ఏడాది పూర్తయ్యింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించింది. అంతేగాకుండా రికార్డులను సైతం బద్దలు కొట్టింది. పుష్ప రాజ్ గా బన్నీ నటన ఎంతో మందిని ఆకట్టుకుంది. ‘తగ్గేదేలా’ అంటూ మీమ్స్, వీడియోస్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఒక్క సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. హీరోయిన్ రష్మికకు సైతం మంచి పేరు వచ్చింది.   

ప్రస్తుతం రెండో పార్టు కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పుష్ప– ది రూల్ తీర్చిదిద్దే పనిలో దర్శకుడు సుకుమార్ ఉన్నారు. పుష్ప ఇటీవల రష్యాలో విడుదలైంది. చిత్ర బృందం అక్కడ పర్యటించింది. లేటెస్ట్ గా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పిక్ పోస్టు చేశారు. మాస్కో నుంచి పీటర్ బర్గ్స్ కు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఫొటో దిగామని చెప్పారు.