మలేషియా ఓపెన్‌ లో అదరగొట్టిన సింధు

మలేషియా ఓపెన్‌ లో అదరగొట్టిన సింధు

కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా ఓపెన్‌ 750  టోర్నమెంట్‌లో భారత  షట్లర్ పీవీ సింధు అదరగొట్టగా, సైనా నెహ్వాల్‌ మాత్రం  నిరాశపరిచింది.  థాయ్‌లాండ్‌కు చెందిన పోర్న్‌పావీ చొచువాంగ్‌ పై సింధు 21-13, 21-17 తేడాతో  గెలిచి రెండో రౌండ్ కు దూసుకెళ్లింది.  అటు మరో గెమ్ లో సైనా నెహ్వాల్‌ అమెరికాకు చెందిన క్రీడాకారిణి ఐరిస్ వాంగ్‌తో పోరాడి ఓడింది. వాంగ్‌ చేతిలో 11-21, 17-21 తేడాతో పరాజయం పాలైంది.  గత  కొద్దిరోజలుగా ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్న సైనాకు ఈ మ్యాచ్ మరో నిరాశానే మిగిల్చింది. 2022లో ఆడిన ఏ టోర్నీలోనూ సైనా రెండో రౌండ్ దాటలేకపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో వెటరన్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ 21-12, 21-7తో దక్షిణ కొరియాకు చెందిన హియో క్వాంగ్‌ హీపై గెలిచి 2వ రౌండ్‌కు చేరుకున్నాడు.