కౌలాలంపూర్లో జరుగుతున్న మలేషియా ఓపెన్ 750 టోర్నమెంట్లో భారత షట్లర్ పీవీ సింధు అదరగొట్టగా, సైనా నెహ్వాల్ మాత్రం నిరాశపరిచింది. థాయ్లాండ్కు చెందిన పోర్న్పావీ చొచువాంగ్ పై సింధు 21-13, 21-17 తేడాతో గెలిచి రెండో రౌండ్ కు దూసుకెళ్లింది. అటు మరో గెమ్ లో సైనా నెహ్వాల్ అమెరికాకు చెందిన క్రీడాకారిణి ఐరిస్ వాంగ్తో పోరాడి ఓడింది. వాంగ్ చేతిలో 11-21, 17-21 తేడాతో పరాజయం పాలైంది. గత కొద్దిరోజలుగా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్న సైనాకు ఈ మ్యాచ్ మరో నిరాశానే మిగిల్చింది. 2022లో ఆడిన ఏ టోర్నీలోనూ సైనా రెండో రౌండ్ దాటలేకపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో వెటరన్ షట్లర్ పారుపల్లి కశ్యప్ 21-12, 21-7తో దక్షిణ కొరియాకు చెందిన హియో క్వాంగ్ హీపై గెలిచి 2వ రౌండ్కు చేరుకున్నాడు.