- ఆసియా బ్యాడ్మింటన్కు టీమ్ ఎంపిక
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్.. ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఇండియా జట్టును నడిపించనున్నారు. వచ్చే నెల 14–19 వరకు దుబాయ్లో ఈ టోర్నీ జరగనుంది. మెడల్స్ వచ్చే టోర్నీ కావడంతో టాప్ ప్లేయర్లను డైరెక్ట్గా తీసుకున్న బాయ్.. మిగతా టీమ్ కోసం ట్రయల్స్ను నిర్వహించింది. విమెన్స్ సింగిల్స్లో సింధుకు తోడుగా ఆకర్షి కశ్యప్ను తీసుకున్నారు. మెన్స్లో లక్ష్యసేన్, ప్రణయ్ బరిలో ఉన్నారు. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్స్ సాత్విక్–చిరాగ్ షెట్టి, కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్..మెన్స్ డబుల్స్ బాధ్యతలను మోయనున్నారు. విమెన్స్ డబుల్స్లో ఆల్ ఇంగ్లండ్ సెమీఫైనలిస్ట్ పుల్లెల గాయత్రి–ట్రీసా జోలీ, అశ్విని భట్–శిఖా గౌతమ్ జోడీలను బాయ్ ఎంపిక చేసింది. మిక్స్డ్ డబుల్స్లో ఇషాన్ భట్నాగర్–తానిషా క్రాస్టో పై భారం వేశారు. కొవిడ్ కారణంగా 2021 టోర్నీని నిర్వాహకులు రద్దు చేశారు. టోర్నీకి బలమైన టీమ్ను ఎంపిక చేశామని అని బాయ్ సెక్రటరీ సంజయ్ మిశ్రా చెప్పారు.