ఆపరేషన్ మిడ్నైడ్ హామర్: అమెరికాలో హై అలెర్ట్.. ట్రంప్ పర్యటనలన్నీ రద్దు

ఆపరేషన్ మిడ్నైడ్ హామర్: అమెరికాలో హై అలెర్ట్.. ట్రంప్ పర్యటనలన్నీ రద్దు

పశ్చిమాసియాలో ఉద్రిక్తపరిస్థితుల నేపథ్యంలో అమెరికాలో హై అలెర్ట్​ ప్రకటించారు.  ఇరాన్​ అణు స్థావరాలపై విరుచుకుపడిన అమెరికా... ప్రతి దాడులు జరుపుతుందనే అనుమానంతో ముందస్తు చర్యగా ట్రంప్​ తన అధికారిక పర్యటనలు రద్దు చేసుకున్నారు.  

ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ‘అమెరికా దాడులు మొదలు పెట్టింది.. ఇక మేం ముగింపు ఇస్తాం’ అని ఇరాన్‌ తాజాగా హెచ్చరిక చేసింది. ఈ క్రమంలో ఇరాన్‌ ప్రతీకార చర్యలకు  ధీటుగా సమాధానం ఇస్తుందనే  అనుమానంతో అమెరికాపాలకులు హైఅలర్ట్‌  ప్రకటించారు

అమెరికాలోని ప్రధానగరాల్లో  ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేసింది. వాషింగ్టన్‌ సహా పలు నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇరాన్‌లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీస్ అధికారులు  తెలిపారు. పలు ముఖ్య ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.

 ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉన్న కమ్యూనిటీలతో ముడిపడి ఉన్న ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ  పెట్టామని NYPD మాజీ ఇన్‌స్పెక్టర్ పాల్ మౌరోవెల్లడించారు. ఇజ్రాయెల్‌తో ముడిపడి ఉన్న ప్రదేశాలు, షియా మసీదుల్లో గస్తీని పెంచామన్నారు. 

We’re tracking the situation unfolding in Iran. Out of an abundance of caution, we're deploying additional resources to religious, cultural, and diplomatic sites across NYC and coordinating with our federal partners. We’ll continue to monitor for any potential impact to NYC.

— NYPD NEWS (@NYPDnews) June 22, 2025

న్యూయార్క్​లో భద్రతా బలగాల గస్తీని పెంచారు. ఇరాన్‌లో జరుగుతున్న పరిస్థితిని ట్రాక్ చేస్తున్నారు. నగరం అంతటా అదనపు బలగాలను మోహరించాం’. అని పేర్కొన్నారు. పలు శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని, న్యూయార్క్ నగరానికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందో లేదో పర్యవేక్షిస్తూనే ఉన్నామని పోలీస్​ విభాగం తెలిపింది.

ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా  తీవ్ర దాడులకు పాల్పడింది. అత్యంత శక్తివంతమైన B–2 స్పిరిట్​ బాంబర్లతో ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేశామని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్​ వెల్లడించారు. అయితే ప్రతీకారంగా ఇరాన్​ దాడులకు తెగబడే అవకాశం ఉండడంతో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తపడుతున్నాయి. అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేశాయి.