
ఇరాన్ను అమెరికా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరిట ఇరాన్లోని మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేసింది. ఫార్దో, నతాంజ్, ఇస్పహాన్ అణు స్థావరాలపై దాడి చేసింది అమెరికా. బీ-2 స్పిరిట్ అనే భారీ బాంబర్లతో భీకర దాడులు జరిపింది. దాడుల అనంతరం ఇరాన్ లోని మూడు అను స్థావరాలపై బాంబులు వేసినట్లు ఆదివారం (జూన్ 22) ట్రంప్ ప్రకటించారు.
ఆపరేషన్ మిడ్నైడ్ హామర్ను 25 నిమిషాల్లో పూర్తి చేశారు. తూర్పు ప్రామాణిక సమయం ప్రకారం సాయంత్రం 6.40 గంటలకు, ఇరాన్ సమయం ప్రకారం తెల్లవారుజామున 2.10 గంటలకు, B-2 విమానం ఫోర్డో వద్ద GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (MOP) బాంబులను విసిరారు. ఈ ఆపరేషన్ కు మొత్తం 14 MOP ( బాంబ్) లను ఉపయోగించారు. . తూర్పు సమయం ప్రకారం సాయంత్రం 6.40 నుంచి సాయంత్రం 7.05 గంటల మధ్య మూడు ఇరాన్ అణుకేంద్రాలను అమెరికా ధ్వంసం చేసింది.
ఆపరేషన్ మిడ్నైట్ హామర్ లో ఏడు బీ2 బాంబర్లు, 125 యుద్ద విమానాలను ఉపయోగించారు. లక్ష్యాన్ని పూర్తి చేసిన వెంటనే యుద్ద విమానాలు ఇరాన్ గగన తలాన్ని వదలి పెట్టాయి. బస్టర్ బాంబులతో బంకర్లపై దాడి చేసారు. ఇవి ఒక్కొక్క బాంబు 13 వేల కేజీలతో 2 టన్నుల పేలుడు పదార్థాలు కలిగి ఉంటాయి. 2001 సెప్టెంబర్ 11 తరువాత మొదటి సారి బీ2 బాంబులు వినియోగించారు. ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా 75 ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలను ఉపయోగించింది. ఇరాన్ దృష్టిని మళ్లించి అమెరికా మిడ్నైట్ హామర్ ఆపరేషన్ పూర్తి చేసింది.