ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ : 25 నిమిషాలు.. ఇరాన్ మూడు అణుకేంద్రాలు ధ్వంసం.. ఎలా జరిగిందంటే..!

ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ : 25 నిమిషాలు.. ఇరాన్  మూడు అణుకేంద్రాలు  ధ్వంసం.. ఎలా జరిగిందంటే..!

ఇరాన్​ను అమెరికా కోలుకోలేని దెబ్బ కొట్టింది.  ఆపరేషన్​ మిడ్​నైట్​ హామర్​ పేరిట ఇరాన్​లోని మూడు అణు కేంద్రాలను ధ్వంసం చేసింది.  ఫార్దో, నతాంజ్‌, ఇస్పహాన్‌ అణు స్థావరాలపై దాడి చేసింది అమెరికా. బీ-2 స్పిరిట్‌ అనే భారీ బాంబర్లతో భీకర దాడులు జరిపింది. దాడుల అనంతరం ఇరాన్ లోని మూడు అను స్థావరాలపై బాంబులు వేసినట్లు ఆదివారం (జూన్ 22) ట్రంప్ ప్రకటించారు. 

ఆపరేషన్​ మిడ్​నైడ్​ హామర్​ను 25 నిమిషాల్లో పూర్తి చేశారు.  తూర్పు ప్రామాణిక సమయం ప్రకారం  సాయంత్రం 6.40 గంటలకు, ఇరాన్ సమయం ప్రకారం తెల్లవారుజామున 2.10 గంటలకు,  B-2 విమానం ఫోర్డో వద్ద  GBU-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (MOP) బాంబులను విసిరారు.  ఈ ఆపరేషన్​ కు  మొత్తం 14 MOP ( బాంబ్​) లను ఉపయోగించారు. . తూర్పు సమయం ప్రకారం సాయంత్రం 6.40 నుంచి  సాయంత్రం 7.05 గంటల మధ్య మూడు ఇరాన్​ అణుకేంద్రాలను అమెరికా ధ్వంసం చేసింది.  

ఆపరేషన్​ మిడ్​నైట్​ హామర్​ లో ఏడు బీ2 బాంబర్లు, 125 యుద్ద విమానాలను ఉపయోగించారు.  లక్ష్యాన్ని పూర్తి చేసిన వెంటనే యుద్ద విమానాలు ఇరాన్​ గగన తలాన్ని వదలి పెట్టాయి.  బస్టర్​ బాంబులతో బంకర్లపై దాడి చేసారు.  ఇవి ఒక్కొక్క బాంబు 13 వేల కేజీలతో 2 టన్నుల పేలుడు పదార్థాలు కలిగి ఉంటాయి. 2001 సెప్టెంబర్​ 11 తరువాత మొదటి సారి బీ2 బాంబులు వినియోగించారు. ఈ ఆపరేషన్ సమయంలో అమెరికా  75 ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలను ఉపయోగించింది.  ఇరాన్​ దృష్టిని మళ్లించి అమెరికా మిడ్​నైట్​ హామర్​ ఆపరేషన్​ పూర్తి చేసింది.