ఇండోనేషియా సూపర్ సిరీస్ నుంచి సింధు ఔట్

ఇండోనేషియా సూపర్ సిరీస్ నుంచి సింధు ఔట్

ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ 1000 టోర్నీలో పీవీ సింధు ఓడిపోయింది. ఉమెన్స్  సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఏడో సీడ్‌ గా బరిలోకి దిగిన  సింధు 14--21, 18-21తో చైనా ప్లేయర్ హి బింగ్‌ జియావో చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. 47 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో ఆరంభం నుంచే వెనుకబడింది. ఫస్ట్ గేమ్లో బ్రేక్ టైంకు  బింగ్‌ జియావో 11--4తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత పుంజుకున్న  సింధు పదునైన షాట్లతో  ప్రత్యర్థికి సమీపంగా వచ్చింది. అయితే ఈ దశలో చైనా షట్లర్ విజృంభించి..14-21తో తొలి గేమ్ను సొంతం చేసుకుంది.  సెకండ్ గేమ్లోనూ బింగ్ జియావో  అదే జోరును కొనసాగించింది. సూపర్ స్మాష్లతో సింధును బెదరగొట్టింది. సింధుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను 21-18తో మ్యాచ్ ను దక్కించుకుంది.  అటు మెన్స్ సింగిల్స్లో సాయిప్రణీత్ డెన్మార్క్ ప్లేయర్  హన్స్ క్రిస్టియన్ చేతిలో 16-21, 19-21తో పరాజయం పాలయ్యాడు. మరోవైపు సమీర్ వర్మ రెండో రౌండ్ కు చేరుకున్నాడు. ఫ్రాన్స్ ఆటగాడు థామస్ రౌక్సెల్పై 21-19, 21-15తో విజయం సాధించాడు.