క్వార్టర్ ఫైనల్కు సింధు, ప్రణయ్..

క్వార్టర్ ఫైనల్కు సింధు, ప్రణయ్..

ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మలేషియా ఓపెన్లో దూసుకుపోతుంది.  ప్రీ క్వార్టర్స్లో సింధు థాయిలాండ్ ప్లేయర్ ఫిట్టయాపోర్న్ చైవాన్‌పై విజయం సాధించింది. మొత్తం 57 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో సింధు మొదటి గేమ్ను 19-21తో కోల్పోయింది. అయితే ఈ దశలో తన అనుభవాన్నంత ఉపయోగించి అద్భుతంగా ఆడింది. రెండో గేమ్ను 21-9తో గెలుచుకుంది. ఇదే జోరును కొనసాగించిన సింధు..నిర్ణయాత్మక గేమ్లోనూ సూపర్ స్మాష్ లు, షాట్లతో ప్రత్యర్థిను పరిగెత్తించింది. అదే క్రమంలో 21-14తో మ్యాచ్ను సొంతం చేసుకుంది. 

అటు మెన్స్ సింగిల్స్లో  ప్రపంచ 21వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ కూడా మెన్స్ సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. ప్రీ క్వార్టర్లో అతను నాలుగో సీడ్ చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్పై 21-15, 21-7 తేడాతో సులువుగా విజయం సాధించాడు. 

ఇక మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి  షట్లర్ పారుపల్లి కశ్యప్ నిష్క్రమించాడు. ప్రీ క్వార్టర్స్లో అతను థాయిలాండ్ ప్లేయర్ కున్లవుట్ విటిద్సర్న్ చేతిలో  21-19,21-10 స్కోరు తేడాతో ఓడిపోయాడు. కేవలం 44 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో కశ్యప్ ఏ మాత్రం ప్రత్యర్థిపై  పైచేయి సాధించలేకపోయాడు. తొలి గేమ్లో మాత్రమే కొద్దిగా పోరాడాడు. అయితే థాయిలాండ్ ప్లేయర్ సూపర్ పర్ఫామెన్స్ ముందు నిలవలేక పోయాడు. ఇక రెండో గేమ్లో అయితే కనీసం పోటీ కూడా ఇవ్వలేక మ్యాచ్ను కోల్పోయాడు.