ఏఐకి మరింత ప్రాధాన్యం: క్వాలిజీల్ ప్రకటన

ఏఐకి మరింత ప్రాధాన్యం: క్వాలిజీల్ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: మోడర్న్​ క్వాలిటీ ఇంజనీరింగ్​, డిజిటల్​ ట్రాన్స్​ఫర్మేషన్​ కంపెనీ క్వాలిజీల్ ఏఐపై మరింత ఫోకస్​పెట్టాలని నిర్ణయించింది.  ఇందులో భాగంగా సంస్థ ఇప్పటికే 600 మందికి పైగా ఇంజనీర్లకు ట్రైసెంట్రిస్ ఏఐ ప్లాట్‌‌ఫారమ్‌‌లలో శిక్షణ ఇచ్చింది. కంపెనీకి భారతదేశం, యూఎస్​ గ్లోబల్​ సెంటర్లలో 850 మందికి పైగా నిపుణులు ఉన్నారు. 

2028 నాటికి 1,200 కొత్త ఉద్యోగాలను సృష్టించాలని ఇది​ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ టెక్నికల్​ నైపుణ్యంపై దృష్టి పెట్టామని క్వాలిజీల్ సీఈఓ కళ్యాణ్​ కొండ చెప్పారు. ఉద్యోగులకు నైపుణ్యాలను పెంపొందించడం వృద్ధికి అత్యవసరమని చెప్పారు. 2021లో స్థాపించినప్పటినుంచి క్వాలిజీల్​ 71 శాతం వార్షిక వృద్ధి రేటుతో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.