క్వాంటమ్ ​స్కూటర్ల ధరలు తగ్గింపు

క్వాంటమ్ ​స్కూటర్ల ధరలు తగ్గింపు

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) స్టార్టప్ క్వాంటమ్ ఎనర్జీ ఆఫర్లను ప్రకటించింది. ప్లాస్మా ఎక్స్,​  ఎక్స్​ఆర్​ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ధరలను 10శాతం తగ్గించింది. గతంలో వీటి ధరలు వరుసగా రూ.​ 1,19,525,  రూ.​ 99,757గా ఉండేవి. ఇప్పుడు ఇవి రూ.​ 1.09 లక్షలు,  రూ.​ 89వేలకు తగ్గాయి. ఈ ఆఫర్ 31 మార్చి 2024 వరకు  ఉంటుంది.  శక్తివంతమైన 1500వాట్ల మోటార్  ఉన్న ప్లాస్మా ఎక్స్​ కేవలం 7.5 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.