ఓయూ, వెలుగు: ఓయూ ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్ను బేషరతుగా ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఓయూ పరిపాలన భవనంలో రిజిస్టార్ ప్రొఫెసర్ నరేశ్రెడ్డిని కలిసి ఈ అంశంపై చర్చించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల సౌకర్యాలపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి యూనివర్సిటీ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్ల నిధులు ప్రకటించినప్పటికీ, వాటికి అనుగుణంగా అధికారులు వ్యవహరించడం లేదని విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాలు, కక్షలతో వ్యవహరించడం తగదని, సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని, లేదంటే బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
