YCP ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలి : కృష్ణయ్య

YCP ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలి : కృష్ణయ్య

బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ ను కల్పించి..పార్లమెంట్ లో బీసీ బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేశారు బీసీ సంఘాల జాతీయ నేత ఆర్.కృష్ణయ్య. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో 28 బీసీ కులసంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్. కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు.

పార్లమెంట్ లో వైసీపీ ప్రవేశ పెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు కృష్ణయ్య. తెలంగాణలో బీసీలు మెజార్టీ సంఖ్యలో ఉన్నా చట్ట సభలో 19 మంది మాత్రమే ఉండటానికి రిజర్వేషన్ లేకపోవడమే కారణమన్నారు. దేశంలోని 96 మంది బీసీ ఎంపీలు పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు ఇవ్వాలన్నారు.