ఖనిజ సంపదను.. అంబానీ,అదానీలకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్

ఖనిజ సంపదను.. అంబానీ,అదానీలకు  దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్

అడవుల్లోని ఖనిజ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే అమిత్ షా .. నక్సలైట్ రహిత దేశంగా  చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు ఆర్ నారాయణ మూర్తి. హైదరాబాద్ ధర్నా చౌక్ లో శాంతి చర్చల కమిటీ మహా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... అణిచివేయాల్సింది మావోయిస్టులను కాదు దోపిడీని అని అన్నారు. పాకిస్తాన్ తో చర్చలు జరిపిన కేంద్రం.. భరత మాత ముద్దు బిడ్డలైన మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. అన్యాయాన్ని అడిగిన వాడు నక్సలైట్.. అడగని వాడు ఆల్ రైట్ అనే ఉద్దేశంతో కేంద్రం  వ్యవహరిస్తుందని విమర్శించారు.

చర్చలతోనే పరిష్కారం

మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యమని అన్నారు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ . ఇది యుద్ద సమయం కాదు..  చర్చలతోనే పరిష్కరించుకోవాలని మాస్కో  సైప్రస్ లో అన్న  మోదీ మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపరని ప్రశ్నించారు.  మావోలతో చర్చలు జరపకున్నా సరే... ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపాలని సూచించారు. భారత రాజ్యాంగం ఆధారంగా చర్చలు జరపండి. దేశంలోని సహజ వనరులను ప్రజల అభివృద్ధి కోసమే వాడాలని రాజ్యాంగంలో తెలిపిందన్నారు.  చర్చలు జరిపితే ఆదివాసీ ప్రాంతాల్లో అల్లకల్లోలం ఆగుతుందన్నారు.  చర్చలు జరగకుంటే మావోయిస్టులకు ఇబ్బంది లేదు... ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. కానీ ఆదివాసీ బిడ్డలకు కష్టం వస్తుంది.. వారి హక్కుల భంగం కలుగుతుందని హెచ్చరించారు. మావోయిస్టులైన భారత పౌరులను చంపుతున్న మోదీ,అమిత్ షా... వీళ్లేం హిందువలని   ప్రశ్నించారు. ఇదేనా రామ రాజ్యం అంటే?  ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపేసి శాంతి చర్చలు జరపాలని  అన్నారు. 

ప్రైవేట్ సంస్థల కోసమే ఆపడం లేదు

కార్పొరేట్ సంస్థల కోసమే ఆదివాసీలపై కేంద్రం యుద్ధం చేస్తుందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్.  శాంతి చర్చలే  అభివృద్ధికి మార్గం అవుతుందన్నారు. హై సందర్భంగా మాట్లాడిన ఆయన  చర్చలతో మావోయిస్టుల సమస్యకు  పరిష్కారమని అన్నారు. అడవిలోకి కేంద్రం ఎందుకు వెళ్తోంది. ఆపరేషన్ కగార్ ప్రైవేట్ సంస్థల కోసమే ఆపడం లేదని విమర్శించారు. చర్చలతోనే మావోయిస్టు సమస్య పరిష్కారమని అన్నారు హరగోపాల్..

ALSO READ | CM రేవంత్‎తో పాటు నా ఫోన్ ట్యాప్.. కేటీఆర్ సిగ్గుతో తల దించుకోవాలి: TPCC చీఫ్