
థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన రాధికా ఆప్టే (Radhika Apte) దొరికిన ఏ వేదికని వదలట్లేదు. ఆన్ స్క్రీన్ నుంచి ఆఫ్ స్క్రీన్ వరకూ ఈ అమ్మడు మార్క్ పడాల్సిందే. సినిమాలు..టెలివిజన్ షోస్..వెబ్ సిరీస్ లు ఇలా అన్నింటా నేనున్నానంటోంది. క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నా.. ఇష్టమైన సినిమాలొస్తే గెస్ట్ గా అయినా వెళ్లిపోతోంది.
లేటెస్ట్గా ఓ సినిమాలో అలానే కమిట్ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసింది. విజయ్ సేతుపతి..కత్రినా కైఫ్ జంటగా శ్రీరాం రాఘవన్ `మేరీ క్రిస్మస్`(Merry Christmas) అనే చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో రాధికా ఆప్టే గెస్ట్ రోల్ లో నటిస్తోంది. కీలక పాత్ర అంటే? ఓ ఐదారు సన్నివేశాలుంటాయి అనుకుంటారు. కానీ ఈ సినిమాలో రాధికకి కేవలం ఒకే సీన్ ఉందట. ఎందుకు ఒప్పుకుందో ఓ మంచి లాజిక్ కూడా చెప్పిందీ అమ్మడు. కారణం దర్శకుడేనంటోంది.
అతను మంచి మిత్రుడు కావడంతో ఆఫర్ కాదనలేదట. ఓ రోజు ఫోన్ చేసి నీది ఒక్క సీన్..పరిమితమైన పాత్ర..చేస్తావా అని అడిగితే మారు మాట్లాడకుండా ఎస్ చెప్పానంటోంది. ఒక్క సీన్ అయినా షూటింగ్ కోసం మాత్రం రెండు రాత్రుళ్లు పాల్గొనాల్సి వచ్చిందంటోంది. మరి పారితోషికం ఎంత తీసుకుందో?