ఆపరేషన్ సిందూర్:పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ సంధించిన వెపన్స్ ఇవే

ఆపరేషన్ సిందూర్:పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ సంధించిన వెపన్స్ ఇవే

పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ పంజా విసిరిన సంగతి తెలిసిందే.. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్ భూభాగంలో ఉమ్మడి వైమానిక దాడులు పారరంభించాయి. స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు ( స్కాల్ప్ స్ట్రామ్ షాడో క్రూయిజ్ మిస్సైల్ ), హ్యామర్ ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు సామాగ్రితో కూడిన రాఫెల్ జెట్ లతో 9 ఉగ్రవాద స్థావరాలపై ఉగ్రవాద శిబిరాలపై భీకర దాడి చేసింది భారత్.

ఇండియన్ నేవీ ఫోర్సెస్ మద్దతుతో ఇండియన్ ఎయిర్ స్పేస్ నుండే ఈ దాడులు జరిగాయి.. ఇది సముద్ర, వైమానిక దళాల కోఆర్డినేటెడ్  ఆపరేషన్. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేక మందుగుండు సామగ్రిని ఉపయోగించారని, ఒక్క భారతీయ విమానాన్ని కూడా కోల్పోలేదని తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో సైన్యం, నావికాదళం, వైమానిక దళం మల్టీ టార్గెట్స్ తో రంగంలోకి దిగాయి. 

 

ఆపరేషన్ సిందూర్ కింద, బహవల్‌పూర్, మురిడ్కే, గుల్పూర్, భింబర్, చక్ అమ్రు, బాగ్, కోట్లి, సియాల్‌కోట్, ముజఫరాబాద్‌లోని తొమ్మిది స్థానాలపై దాడి చేసింది భారత్.