బీజేపీపై ప్రజల్లో ఆదరణ పెరిగింది: రఘునందన్ రావు

బీజేపీపై ప్రజల్లో ఆదరణ పెరిగింది:  రఘునందన్ రావు

కాంగ్రెస్ మనుగడ కొనసాగాలంటే బీఆర్ఎస్.. కొన్ని సీట్లు సాధించాలంటూ మీడియాలో కుట్రపూరితమైన ప్రచారాలు జరుగుతున్నాయన్నారు సిద్దపేట మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ లో రఘునందన్ రావు మీడియా సమావేశం మాట్టాడారు.

విజయ సంకల్పయాత్ర ప్రారంభించి మూడు రోజులు విజయవంతంగా పూర్తయిందని..  సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు రఘునందన్ రావు. మీడియాలో వచ్చే తప్పుడు కథనాలు నమ్మొద్దని.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్పారాయన.  17 పార్లమెంట్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండవన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. ప్రధాని మోదీపై, బీజేపీపై ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని..  అవాస్తవాలు మీడియాలో ప్రచురించవద్దని ఆయన అన్నారు. 5 ప్రాంతాల నుండి ప్రారంభమైన విజయ సంకల్ప యాత్ర ప్రజా సమస్యలను ప్రజా సమస్యలను విజయవంతంగా కొనసాగుతుందని రఘునందన్  చెప్పారు.