- హుజురాబాద్ లో ఆత్మాభిమానానికి అహంకారానికి మధ్య పోటీ
టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారంలోఎన్నికల ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా మాట్లాడిన రఘునందన్ రావు.. హుజురాబాద్ లో ఆత్మాభిమానానికి అహంకారానికి మధ్య పోటీ అన్నారు. కడుపు నిండా అన్నం పెట్టేవాడు ఈటల అన్నారు. కేసీఆర్ చిటికెన వేలు అయితే.. మోడీ బొటన వేలు లాంటివాడన్నారు. పండించినా ప్రతీ గింజా కొనాలన్నారు. లేకపోతే బండెనక బండి కట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోసి కొనే వరకు వదిలిపెట్టబోమన్నారు. ఆగం చేద్దాం కానీ ఆగం కావొద్దన్నారు. టీఆర్ఎస్ వాళ్లు ఎన్ని ఇచ్చినా తీసుకుని.. ఓటు మాత్రం ఈటలకు వేయాలన్నారు. బాత్రూమ్ కడితే రూ. 9 వేలు కేంద్రం ఇస్తుందని.. సీసీ రోడ్డుకి లక్ష రూపాయలు అయితే 90 వేలు ఇస్తుందని అన్నారు. కానీ తాను ఇస్తున్నట్టుగా కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారన్నారు.