
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ వాయనాడ్లో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతంలో పర్యటించారు.వీరి వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఉన్నారు. కన్నూరు ఎయిర్ పోర్ట్ నుంచిరోడ్డు మార్గంలో సుల్తాన్ బతేరీకి వెళ్లారు. కేరళలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. వాయనాడ్ ఘటనపై సీఎం విజయిన్ తో చర్చించనున్నారు.
ఇంకా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని... అయినా వేగంగా సహాయక చర్యలుకొనసాగుతున్నాయన్నారు. వాస్తవానికి బుధవారం( జులై 31)న సందర్శించాలనుకున్న రాహుల్, ప్రియాంకలు... ప్రతికూల వాతావరణం కారణంగా ఈ రోజు ( ఆగస్టు 1)న వెళ్లారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తానని ప్రతిపక్షనేత రాహుల్ అన్నారు. వాయనాడ్ ఘటనపై అంచనా వేసేందుకు రక్షణశాఖామంత్రి.. సీఎం విజయన్ తో మాట్లాడానన్నారు.
కేరళలో ప్రకృతి వైపరీత్యాలలో వాయనాడ్లో కుండపోత వర్షం కారణంగా సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడటంతో కనీసం ఇప్పటికి 282 మంది మరణించారు . 200 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల 240 మంది చిక్కుకు పోయారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.