చెప్పుల స్టాండ్ లో పనిచేసిన రాహుల్ గాంధీ

చెప్పుల స్టాండ్ లో పనిచేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరుసగా రెండో రోజు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. గోల్డెన్ టెంపుల్‌లో పూజలు చేసిన తర్వాత గాంధీ అక్కడ కాసేపు చెప్పుల స్టాండ్ లో పనిచేశారు. నీలం రంగు తలపాగా ధరించి స్వచ్ఛంద సేవలో పాల్గొన్నారు. 

అక్కడికి వచ్చే భక్తులకు తన చేతులుతో స్వయంగా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కాంగ్రెస్ ట్విట్టర్ లో షేర్  చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా రాహుల్ నిన్న ఇదే ఆలయంలో గిన్నేలు, భోజనం ప్లేట్లు కడిగారు.    

Also Read :- తగ్గిన బంగారం, వెండి ధరలు

రాహుల్ గాంధీ  తన వ్యక్తిగత, ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా వారింగ్ తెలిపారు.